ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు జరిగే ఇంటర్మీడియట్ విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి : ఎస్ ఎఫ్ ఐ బో

Published: Monday December 20, 2021
బోనకల్, డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి:ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విద్యార్థులందరినీ మనోవేదనకు గురిచేస్తూ విద్యార్థులందరినీ ఫెయిల్ చేయడాన్ని నిరసిస్తూ ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థుల అందరికీ ఉచితంగా రివల్యూషన్ సదుపాయాన్ని కల్పించాలని, విద్యార్థులు చనిపోతున్న పట్టించుకోని విద్యాశాఖ మంత్రి ని బోర్డు కార్యదర్శి బర్తరఫ్ చేయాలని, చనిపోయిన విద్యార్థులకు కుటుంబాలకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ బోనకల్ మండల కార్యదర్శి డిమాండ్ చేసారు.