మధిర సేవా సమితి కి విశ్వ జనని జాతీయ సేవా రత్న అవార్డు

Published: Monday April 25, 2022
మధిర ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మధిర సేవా సమితి అధ్యక్షులు మధిర పట్టణంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. ప్రజల మన్నలను పొందిన మధిర సేవా సమితి అధ్యక్షుడు పల్ల పోతూ ప్రసాదరావు, ఉపాధ్యక్షుడు కొమిటీడి శ్రీనివాసరావుకి, ఈ రోజు హైదరాబాద్ లో విశ్వ జనని ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విశ్వ జనని జాతీయ సేవా రత్న అవార్డు ను అందచేయ బడుతుంది. ఈ కార్యక్రమంమనికి ముఖ్య అతిధులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ జేడీ లక్ష్మీనారాయణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, సినీ నటులు సుమన్, బాబు మోహన్, రాగిణి విచ్చేస్తున్నారు వీరి చేతుల మీదుగా విశ్వ జనని జాతీయ సేవా రత్న అవార్డు ఈ రోజు హైదరాబాదులో మధిర సేవా సమితి అధ్యక్షులు, ఉపాద్యక్షులు వారికి ఈ బహుమతి ప్రధానం చేయబడుతుంది.. ఈ కార్యక్రమానికి మధిర సేవా సమితి అధ్యక్షుడు పల్లపోతు ప్రసాదరావు ఉపాధ్యక్షులు కోమిటీడి శ్రీనివాసరావు పబ్లిక్ రిలేషన్ చైర్మన్ షేక్ జహంగీర్ పాల్గొంటున్నారు