సర్పంచ్ మేడిశెట్టి లీలావతి ఆధ్వర్యంలోఆసరా పింఛన్ గుర్తింపు కార్డులు పంపిణీ

Published: Thursday September 01, 2022
మధిర రూరల్ 30 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడుమాటూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మేడిశెట్టి లీలావతి గ్రామంలోని కొత్తగా మంజూరై ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను, మంజూరి పత్రాలను లబ్ధిదారులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు రైతులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశం లోనే  ఆదర్శంగా తెలంగాణ ఆదర్శం తీసుకుంటున్నారని అన్ని .వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కృష్ణారెడ్డి , ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వరావు,మాజీ ఎంపీటీసీ మేడిశెట్టి నాగేశ్వరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.