రజక సంఘ భవనం ను ప్రారంభించిన జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్

Published: Tuesday June 14, 2022

కోరుట్ల, జూన్ 13 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో రజక  సంఘ భవనం జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్   మరియు మాదాపూర్ గ్రామ సర్పంచ్ దారిశెట్టి రాజేష్ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాజేష్  మాట్లాడుతూ అన్ని కులాలకు ఏదో విధంగా మన ప్రభుత్వం సహాయం చేస్తుందని మరియు అండగా నిలుస్తుందని అన్నారు . ఈ కార్యక్రమంలో  సర్పంచులు అంజయ్య ,రాజ నర్సయ్య , ముత్తయ్య, భీమరెడ్డి, ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, లతా - రమేష్, ఉప సర్పంచ్ మల్లారెడ్డి,  పిఎసిఎస్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి , జగన్ రావు ,
భూమయ్య, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, రజక సంఘం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.