పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను చేపట్టాలి

Published: Tuesday May 04, 2021
కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
మేడిపల్లి, మే3 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్లో పెండింగ్లో ఉన్న ఓపెన్ డ్రైనేజ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ మందుముల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. డివిజన్లోని ఓల్డ్ విలేజ్ (భరత్ నగర్)లో డ్రైనేజీ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవలనే కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి కాలనీల్లో పర్యటించిన సందర్భంగా డ్రైనేజీ పనులను చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి, ఏఈ వసంతతో కలిసి భరత్ నగర్లోని పెద్ద మసీదు ఏరియాలో జరుగుతున్న పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల సతీష్ ముదిరాజ్, గొరిగ సీను, ఆల్వాల్ సుధాకర్, గొరిగ జంగీర్, సుంకు శేఖర్ రెడ్డి, బోరంపేట జై కృష్ణ, సల్ల ప్రభాకర్ రెడ్డి, గొరిగ నగేష్, బాలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.