మీర్ పేట్ కార్పొరేషన్ లలో తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ జండా పండుగ వేడుకలు

Published: Friday September 03, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 2, ప్రజాపాలన ప్రతినిధి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు అహర్నిశలు శ్రమించి ఉద్యమ నాయకుల ప్రాణ త్యాగం తో తెలంగాణ ఏర్పాటు చేసుకున్న శుభసందర్భంలో దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణం తో జెండా ఆవిష్కరణ  కార్యక్రమాని పలువురు మంత్రులతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు జెండా ఎగరవేసి తెలుగు నినాదాలతో హోరెత్తించారు. ఆ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని మహేశ్వరం నియోజకవర్గంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ లలో టిఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షురాలు స్థానిక కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. పలువురు మాట్లాడుతూ..... సబితమ్మ ఆదేశానుసారంగా గులాబీ జెండా నీడలో ఎల్లవేళల ఉంటూ, కెసిఆర్ పిలుపు మేరకు  అడుగులో అడుగై ముందుకు వెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా 5వ, 7వ, 10 వ, 11వ, 12వ, 16వ, 30వ, 32వ, 36వ, 40వ, 41వ, 43వ, ఇతర డివిజన్లలో కూడా జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్ధాల లావణ్య బీరప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ ర్కల కామేశ్వర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఏ.భూపాల్ రెడ్డి, కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్స్ సిద్ధాల బీరప్ప, ముద్ద పవన్ కుమార్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, గజ్జల రామ్ చందర్, బొక్క రాజేందర్రెడ్డి, ఇంద్రావత్ రవి నాయక్, వేముల నరసింహ్మ, ప్రమీల యాదగిరి ముదిరాజ్, విజయలక్ష్మి రాజు ముదిరాజ్, ధనలక్ష్మి రాజ్ కుమార్, జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి, నవీన్ కుమార్, అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, సురేఖ రమేష్, రేఖ లక్ష్మణ్, కిషోర్, కో ఆప్షన్ సభ్యులు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, మహిళా మణులు, కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షులు దిండి భూపేష్ గౌడ్, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.