చీకటి గుడిసెల్లో వెలుగులు నింపిన జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Wednesday October 06, 2021
మధిర, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : సిరిపురం గ్రామపంచాయతీ పరిధిలో యండపల్లి గట్టు వద్ద ఒరిస్సా నుండి వచ్చిన వ్యవసాయ వలస కూలీలు 15 సంవత్సరాల నుండి నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు, నాటి నుండి నేటి వరకు 15 సంవత్సరాలువారి నివాసాలకు విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నా గత పాలకుల ఎవరు అటువైపు కన్నెత్తి చూసిన వారు లేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ సమస్యను టిఆర్ఎస్ నాయకులు రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు బాబు గారు, సర్పంచ్ కనకపూడి పెద్ద బుచ్చయ్య జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను తెలపగా. వారి సమస్యలు తెలుసుకుని విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి ట్రాన్స్ఫార్మర్,కరెంట్ పోళ్లు, విద్యుత్ లైన్ ఏర్పాటుచేసి, వారి నివాసాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటుతో పాటు వీధిలైట్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేపించడం జరిగింది ఈ సందర్భంగా ఎండపల్లి గుట్ట నివాస ప్రజలు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను, మా మొర ను ఆలకించి మా చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసి వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడం లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు బాబు, యువజన నాయకులు కూన నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు అబ్బూరి కోదండ రామన్, సిరిపురం సర్పంచ్ కనకపూడి పెద్ద బుచ్చయ్య, ఎంపీటీసీ నండ్రు కుమారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రాల సైదిరెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు నంబూరు శ్రీనివాసరావు, మండల కోశాధికారి నల్లమల శ్రీనివాసరావు, మండల కార్యవర్గ సభ్యులు గుర్రాల వెంకట్ రెడ్డి, రైతుబంధు గ్రామ కన్వీనర్ వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
Share this on your social network: