ఉరి వేసుకుని వలస కార్మికుడి ఆత్మహత్య

Published: Tuesday August 03, 2021
కోరుట్ల, ఆగష్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ రహదారిపై ఉన్న ఓ రైస్ మిల్లులో పని చేస్తున్న రంజాన్ (25) అనే వలస కార్మికుడు రైస్ మిల్లుకు పక్కనే ఉన్న కార్మికుల గదుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు పక్కనే ఉన్న రైస్ మిల్ లో గత నాలుగు నెలల నుండి పని చేస్తున్నాడని, బెంగాల్ రాష్ట్రానికి చెందిన రంజాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.