అంత్యక్రియలకు కేఎస్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

Published: Monday January 30, 2023
 కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 జనవరి ప్రజా పాలన : పరిగి నియోజకవర్గం పరిధిలోని దోమ మండలం, పీర్ల గుట్ట తండా నిరుపేద కుటుంబానికి చెందిన నేనావత్ రామ్ దాస్ ఆకస్మిక మరణించడంతో అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేశామని కేసర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పరిగి కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి సూచన మేరకు తన అనుచరులు మృతుని ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. సామాజిక సేవా కార్యక్రమాలు ఏ లక్ష్యంగా కృషి చేస్తున్న పరిగి కేఎస్ఆర్ ట్రస్ట్ మృతుని కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అజయ్ కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మోహన్, రాజు, సతీష్, యాదయ్య, రాములు, వెంకటయ్య గ్రామస్థులు తదితరులు ఉన్నారు.