మిషన్ భగీరథ కార్మికులకు అండగా ఉంటా

Published: Wednesday July 27, 2022

మధిర రూరల్ జులై 26 ప్రజాపాలన ప్రతినిధి మిషన్ భగీరథ కార్మికులకు నిరంతరం అండగా ఉంటానని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించిన సందర్భంగా మంగళవారం జిల్లా అధ్యక్షులు జిల్లేపల్లి బాబురావు ఆధ్వర్యంలో పలువురు కార్మికులు లింగాల కమల్ రాజును కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు సకాలంలో అందే విధంగా మిషన్ భగీరథ అధికారులు మరియు ఎల్ అండ్ టి ప్రతినిధులతో మాట్లాడి కార్మికులకు రావలసిన వేతనాలు ఇప్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు తెలంగాణలో తాగునీటికి సాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో గొప్ప ఆలోచనతో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. వాటిని ప్రజలకు అందజేసే విషయంలో మీరందరూ వారదులుగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. మిషన్ భగీరథ టిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు జల్లేపల్లి బాబురావు మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించి అండగా నిలిచిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ జిల్లా నాయకులు కార్మికులు పాల్గొన్నారు.