రాజ్యసభ సభ్యులు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతికి ప్రగాఢ సానుభూతి

Published: Wednesday September 15, 2021
వికారాబాద్ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 14 సెప్టెంబర్ ప్రజాపాలన : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డు మంజూరు ప్రదాత మాజీ కేంద్ర ఉపరితల  రవాణ శాఖ మంత్రి, ప్రస్తుత రాజ్య సభ సభ్యులు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశామని వికారాబాద్ డిసిసి అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా, చేవెళ్ల, కొడంగల్, బీజాపూర్ ఈ ప్రాంత ప్రజలు ఆయన చేసిన సేవకు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. గాంధీ భవన్ లో మాజీ మంత్రి జానా రెడ్డి , కోదండ రాంరెడ్డిలతో కలిసి నివాళులు అర్పించామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎన్ఓసి ద్వారా ఆస్కార్ ఫెర్నాండేజ్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుండి  హెలిక్యాప్టర్ ద్వారా బస్వకళ్యాణం పర్యటనలో భాగంగా తనని కూడా హెలిక్యాప్టర్ లో రావాల్సిందిగా చెప్పారని వివరించారు. ఆ ప్రయాణ సమయంలో నా అభ్యర్థన మేరకు హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిని కేంద్ర నిధులు 757 కోట్లు రూపాయల ద్వారా యుపిఎ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేశారని తెలిపారు.