బోనాల జాతరలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ సామల కార్పొరేటర్ గుర్రాల

Published: Wednesday July 14, 2021
మేడిపల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి) బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో మేయర్ సామల బుచ్చి రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల జాతరలో 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమ వెంకటేష్ యాదవ్ పాల్గొని మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి ఎల్లమ్మ తల్లి అమ్మవారికిిిి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సామల బుచ్చిరెడ్డి కార్పొరేటర్ గుర్రాల రమ వెంకటేష్ యాదవ్ ను శాలువాతో సత్కరించారు.