ఆలేరు లో రచ్చబండ కు వెల్లే కాంగ్రెస్ నాయకుల అరెస్టు

Published: Tuesday December 28, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా 27 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : కాంగ్రెస్ నాయకులను సోమవారం నాడు అరెస్ట్ చేసిన ఆలేరు పోలీసులు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రైతులతో రచ్చబండ కార్యక్రమం లో భాగంగా ఆలేరు నుండి ఎర్రబెల్లికి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆలేరు పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మరియు పలువురు కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పలువురు నాయకులు తీవ్రంగా ఖండిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యం కాదు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ  ప్రజల కొరకు చేసే పలు కార్యక్రమాలను  అడ్డుకొని  ఈ విధంగా అక్రమ అరెస్టులను చేయడం ప్రజలు ఖండిస్తున్నారని వాపోయారు. రాబోయే రోజులలో ప్రస్తుతం పదవిలో ఉన్న పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని కాంగ్రెస్ నాయకులు  అన్నారు.