మాజీ సర్పంచ్ అనారోగ్యంతో మృతి

Published: Tuesday March 16, 2021

వెల్గటూర్, మార్చి 14 (ప్రజాపాలన ప్రతినిధి)  :  వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు జనగామ సత్యనారాయణ రావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు గ్రామ సర్పంచిగా గ్రామ అభివృద్ధి చేస్తూ గ్రామానికి సేవలు అందించారు. అదేవిధంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ గా ఆలయ అభివృద్ధి  చేశారు.