వర్షం నీరు ఇలా ఉంటే రాస్తా పై నడిచేదెలా
Published: Thursday June 10, 2021
బెల్లంపల్లి, జూన్ 9, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణం లోని అధికంగా రద్దీ ఉండే ఆంధ్ర బ్యాంకు ముందు వర్షం పడితే నీళ్ళు నిల్వ ఉండటంతో నడిచేదెలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బెల్లంపల్లి పట్టణం లోని శంషేర్ నగర్, అంబేద్కర్ నగర్, మరియు బజారుకు వెళ్లి ముఖ్య రహదారి అయిన ఆంధ్ర బ్యాంక్ ప్రధాన రహదారిపై చిన్న వర్షం వస్తేనే నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఇక రోజుల తరబడి వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలని, వెంటనే ఆంధ్ర బ్యాంకు ముందు మున్సిపల్ అధికారులు నిర్మిస్తున్న టాయిలెట్లను తొలగించి నీరు సక్రమంగా పోయేలా ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి పట్టణ పద్మశాలి సంఘం ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Share this on your social network: