కంటి వెలుగును విజయవంతం చేద్దాం*
Published: Thursday January 12, 2023
ఎంపీపీ మొండెం లలిత కుమారి మధిర రూరల్ జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయము నందు మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మొండెం లలిత కుమారి అధ్యక్షతన మధిర మండలంలో జనవరి 18 నుంచి జరగబోయే కంటి వెలుగు కార్యక్రమం పై మధిర మండల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామపంచాయతీ సెక్రటరీలకు, పారామెడికల్ సిబ్బందికి జరిగిన అవగాహన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కంటి వెలుగు కార్యక్రమంలో 18 సంవత్సరాలు దాటిన వారందరూ మీ గ్రామాలలో కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించాలని సర్వేంద్రియానం నయనం ప్రధానం* *కావున ప్రజలంతా ఈ కంటి వెలుగు కార్యక్రమాల్లోభాగస్వాములై కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైన కళ్లద్దాలను ఉచితంగా పొందగలరుకంటి వెలుగు కార్యక్రమం పై వైద్యాధికారులు, డాక్టర్ వెంకటేష్ డాక్టర్ పృథ్వి, డాక్టర్ సునీత ఈ కంటి వెలుగు కార్యక్రమం మాట్లాడుతూ గ్రామపంచాయతీ సర్పంచులు సెక్రటరీలు మీ గ్రామంలో కంటి వెలుగు శిబిరంలో గ్రామ ప్రజలంతా కంటి పరీక్షలు చేయించుకునేటట్లు మోటివేషన్ చేయవలెనని తెలియపరుస్తూ కంటి వెలుగు వీడియోలుప్రదర్శించడం జరిగినది*
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, వివిధ గ్రామపంచాయతీల సర్పంచులు, గ్రామ సెక్రటరీలు మాటూరు పేట దెందుకూరు పరిధిలో పనిచేసే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు*..
Share this on your social network: