జిల్లా పోలీసు కార్యాలయంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కి నివాళులర్పించిన ఎస్పీ సింధూ

Published: Tuesday September 28, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి వేసి ఎస్పీ సింధూశర్మ నివాళులర్పించినారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగించడమే మనందరం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ కె.సురేష్ కుమార్, ఆర్ఐ వామనమూర్తి, ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ రాజు, డిపిఓ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.