ఎర్రుపాలెం లో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Thursday August 19, 2021
ఎర్రుపాలెం, ఆగష్టు 18, ప్రజాపాలన ప్రతినిధి : ఏరుపాలెం మొదటిగా ఎర్రుపాలెం మండల కేంద్రం నుండి జ్వరంతో ఉన్న పలువురిని మధిర హాస్పటల్లో పరామర్శించి డాక్టర్లకు మంచి చికిత్స అందజేయాలని సూచించారుఅనంతరం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని జ్వరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగి పరిసరాలను పరిశీలించి నీటి తొట్టి లు గుంతలను, పరిశీలించి నీరు ఎక్కడ నిల్వ ఉండే విధంగా చూడాలని, అధికారులు ప్రజల కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఉన్నతాధికారులు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పి పరిసరాల పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని తగు చర్యలను వెంటనే తీసుకోవాలని అని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డియంహెచ్వో, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: