బంగారు తెలంగాణ సాధనే లక్ష్యం

Published: Friday March 12, 2021
వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ పాష
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 11( ప్రజాపాలన ) : తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలంటే సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని వికారాబాద్ మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ అబ్దుల్ పాషా అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు కౌన్సిలర్ మంజుల ముత్యంరెడ్డి, పదిహేనవ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంత రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉన్నత విద్యావంతురాలు రాజకీయ మచ్చ లేనటువంటి నాయకురాలు సురభి వాణి దేవికి, అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నేపల్లి షఫీ ఫయాజ్ ఖాన్, మహమ్మద్ సోహెల్, మహమ్మద్ గౌస్, మహమ్మద్ రుక్మొద్దిన్, వి. క్రిష్ణలు ప్రచారంలో పాల్గొన్నారు.