గోవిందపురం ఎల్ గ్రామం లో పర్యటించిన వ్యవసాయ అధికారులు

Published: Thursday November 25, 2021
బోనకల్, నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామంలో మిర్చి లో కొత్త రకం వైరస్ వలన నష్టపోయిన పంటలను ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు. మంగళవారం గోవిందాపురం ఎల్ గ్రామంలో సిపిఐ బృందం పర్యటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులు వెంటనే గ్రామానికి రావాలన్నా విజ్ఞప్తితో బుధవారం మండల వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి ఆకుల వేణులు గోవిందపురం, లక్ష్మీ పురం గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా ఈ నల్ల తామర పురుగులు ఏర్పడ్డాయని వాతావరణంలో మార్పులతోనే ఈ పురుగులు కూడా పోతాయన్న అంచనాల్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారన్నారు. ఉద్యానవన శాఖ అధికారి వేణు మాట్లాడుతూ ఎక్కువ ఖరీదు గల మందులు వాడకుండా స్పైరోటెట్రా మైట్ (మెమెంటో) 1.25 మీ.లి/లీటర్ నీటికి, స్పైనోసాడ్( ట్రెసర్)04.మీ .లి/లీటర్ 
నీటికి,క్లోరోపేనఫైర్ (ఇంటర్ ప్రీడ్) 2 మీ. లి/లీటర్
థియాక్లోప్రీడ్(అలాంటో) 2-మీ.లి /లీటర్ నీటికి
స్పైనోటోరం (డిగిలెట్) 2 మీ లి/లీటర్ నీటికి 
వేపనునే (10000పిపిఎం) 3మీ.లి / లీటర్ నీటికి మందులను పిచికారీ చేస్తే ఫలితం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. రైతులు అనవసరంగా ఖరీదు గల మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో తక్కువ ఖరీదు ఉన్న మందుల్ని వాడాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అధికారుల వెంట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏ ఐ కె ఎస్ జిల్లా కార్యదర్శి జక్కుల రామారావు, తెరాస నాయకులు ఉమ్మినేనీ కృష్ణ చింతలచెరువు లక్ష్మీనారాయణ, సీపీఎం నాయకులు ఉమ్మినేని రవి, జొన్నలగడ్డ శ్రీనివాసరావులతో పాటు రైతులు ఎర్ర పైన నాగేశ్వరావు, నల్లమోతు నరేష్, రావూరి వెంకటయ్య, చింతలచెరువు మాధారయ్య, ఎస్ కె బడే బాబు తదితరులు పాల్గొన్నారు.