మానవత్వం ఎక్కడ అనే సందేశాత్మక షాట్ ఫిలింను ప్రారంభించిన గుంజపడుగు

Published: Saturday June 18, 2022
కరీంనగర్ జూన్ 17 ప్రజాపాలన ప్రతినిధి :

పేదరికంతో ఉన్నటువంటి వారు పడుతున్న ఇబ్బందుల మీద వారి ఒక సందేశాత్మక కథతో డైరెక్టర్ సాయి పుసాల రూపొందిస్తున్న షాట్ ఫిలిం కు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంబించాడం జరిగింది ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు కొదువలేదని కళాకారులకు తెలంగాణ పుట్టినిల్లని మరిముఖ్యంగా చిన్న కళాకారులు ఈ షాట్ ఫిలిం ల ద్వారా వారి ప్రతిభను కనబరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని వారు అన్నారు సిని పరిశ్రమలో కూడ తెలంగాణ భాషా, తెలంగాణ సాంస్కృతిక, తెలంగాణ కళాకారులు ఉంటేనే విజయవంతం అవుతున్నాయని వారి అన్నారు ఈ కార్యక్రమం నటీనటులు వాయు కుమార్, శాంతకుమార్, రాణి, స్వప్న, కుంట రాజ్ కుమార్, అజేయ్, వర్ష తదితరులు పాల్గొన్నారు..