అనేగొని అశోక్ గౌడ్ మాతృమూర్తి (నీలమ్మ) కి నివాళులర్పించిన బిజెపి నేతలు

Published: Thursday July 22, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : అనేగోని నీలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల భాజపా అధ్యక్షులు అనేగోని అశోక్ గౌడ్ మాతృమూర్తి నీలమ్మ పార్థీవదేహానికి బుధవారం నాడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి మాట్లాడుతూ..... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడురు నివాసంలో నివాళులు అర్పించిన వారిలో గూడూరు ఎంపీటీసీ ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు, సర్పంచ్ సాధ మల్లారెడ్డి, పులిమామాడి ఉపసర్పంచి వెంకటాచారి, సామ సురేందర్ రెడ్డి, దీలిప్ గౌడ్, రామకృష్ణ, రఘునందన్, దయ్యాల యాదగిరి, బీజేవైఎం అధ్యక్షుడు లింగం యాదవ్ సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.