జిల్లాలో పార్టీ ప్రతిష్ఠతకు కృషి చేస్తా

Published: Friday January 28, 2022
జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 27 జనవరి ప్రజాపాలన : జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని పటిష్ట పరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని జిల్లా టిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆన్నారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను, చేవెల్ల ఎంపి గడ్డం రంజిత్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ శాసన మండలిలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ హాసన్ జాఫ్రీ, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.