అందరూ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలి.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు..

Published: Saturday November 19, 2022
తల్లాడ, నవంబర్ 18 (ప్రజాపాలన న్యూస్): 
 జిల్లాలో ఉన్న ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు తల్లాడలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావు,  వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధు, రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు జిల్లా ప్రజలు  అంటే ఎంతో విశ్వాసం ఉందని, ఆ నమ్మకాన్ని రానున్న ఎన్నికల్లో నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెద్దేం వీర మోహన్ రెడ్డి, దుగ్గిదేవర వెంకటలాల్, ధూపాటి భద్రరాజు, భారీగా కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.