మధిర పట్టణం కాంగ్రెస అధ్యక్షులు మిర్యాల రమణ గుప్తా ఆధ్వర్యంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ స

Published: Monday January 31, 2022

మధిర జనవరి 30 ప్రజా ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు పట్టణ కాంగ్రెస్అధ్యక్షుడు మిర్యాల రమణ గుప్తా ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యత్వం ముమ్మరంగా పలుు వార్డుల్లో తిరుగుతూ ఇంటిల్లిపాది చేతిలో చేయి కలపండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోండి మధిర పట్టణం లో ఆదివారం ముమ్మరంగా సభ్యత్వ నమోదు జరుగుతుంది.. మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా మధిర పట్టణ, మండల సభ్యత్వాల ఇంచార్జ్ పెండ్ర అంజయ్య గారి ఆధ్వర్యంలో ముమ్మరం చేశారు ఈ సందర్భంగా మధిర సభ్యత్వాల నమోదు ఇంచార్జ్ పెండ్ర అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలు చేర్చాలని మొదలుపెట్టిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన తో 50 లక్షల వరకు సభ్యత్వాల నమోదు అవుతుందని.ఇదీ కేవలం సభ్యత్వం కాదు, రెండు లక్షల ప్రమాద భీమా.. అమరవీరులు కోరుకున్న, స్వతంత్ర తెలంగాణ కావాలని.. నిరుద్యోగులు కోరుకున్న కొలువుల తెలంగాణ కావాలని.. రైతులు కోరుకున్న, మద్దతు ధరల తెలంగాణ కావాలని. ప్రజలు స్పందిస్తున్నారని ఇదేవిధంగా ముందుకు వెళ్ళిన పక్షంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అందరికీ మేలు జరుగుతుందని అన్నారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు మొహమ్మద్ రహీం మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ కాంగ్రెస్ నాయకులు బండారి నరసింహారావు, మాగం ప్రసాద్ మరియు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు