సేవ పురస్కార్ అందుకున్న కె యస్ జి ట్రస్ట్ ద్వారా ప్రజలకుసేవాకార్యక్రమాలుకోనా నరసింహారావుు

Published: Monday November 28, 2022
వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ పురస్కార్ 2022 సంవత్సరానికి ప్రధానం చేసే అవార్డులో మధిర పట్టణానికి చెందిన ఖమ్మం జిల్లా బి జె పి కార్యవర్గ సభ్యులు, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్, కోనా సత్యనారాయణ గుప్తా ట్రస్టు నిర్వాహకులు కోనా నరసింహారావుకు ఆదివారం హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు వల్లూరి ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సినీనటి ఆర్టిస్ట్ గీతా సింగ్, నరసరావుపేట సేవ సమితి నిర్వాహకులు బ్రహ్మానందం చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేశారు ఈ సందర్భంగా కోనా నరసింహారావు మాట్లాడుతూ.మా తండ్రి పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు, అనాధలకు సేవా కార్యక్రమాలు చేసేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉంటారని తెలియజేశారు. సేవా సమితి అధ్యక్షులు పల్లపోతుల ప్రసాదరావు, జివిఆర్, వేముల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు