ఘనంగాహిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
Published: Monday February 20, 2023
రాయికల్, ఫిబ్రవరి 19 (ప్రజాపాలనప్రతినిధి): రాయికల్ మండలంలో ఇటిక్యాల,రామాజీపేట తాట్లవాయి,అల్లీపూర్ గ్రామాలతో పాటు రాయికల్ పట్టణ కేంద్రంలో శివాజీ (గోనెకాపు) రైతు యువజన సంఘంఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ 394 జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రూరమైన మొగలాయి పరిపాలనలో హిందూ సమాజం మగ్గుతున్న వేళ,హిందూ సమాజానికి రక్షణ లేని సమయంలో పవిత్ర మాతృమూర్తుల కన్నీళ్లు మహానదులై ప్రవహిస్తున్న వేళ ఛత్రపతి శివాజీ జన్మించాడని,శివాజీ మహారాజ్ స్వతంత్ర హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూదేశంలో హిందువులు సగర్వంగా జీవించగలిగే స్థితిని నిర్మాణం చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలసర్పంచులు, రాయికల్ పట్టణశివాజీ రైతు యువజన సంఘం రైతులు,రాజకీయనాయకులు, గ్రామాల యువజన సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: