ముగిసిన మొండితోక ప్రేమానందం అంత్యక్రియలు

Published: Monday May 31, 2021
మధిర, మే 31, ప్ర్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధి స్వాతంత్ర సమరయోధుడు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మొండితోక ప్రేమానందం (101) ఆదివారం మృతి చెందారు. ఆరోగ్యంగానే ఉన్నా గడచిన కొద్దిరోజులుగా వారి స్వగ్రామం కృష్ణాజిల్లా మాగల్లు గ్రామంలో ఉన్నారు. ఈయనతెరాస జిల్లా నాయకులు మొండితోక జయాకర్, మొండి తోక సుధాకర్, విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభాకర్ ల తండ్రి, ప్రస్తుత, మాజీ మధిర మున్సిపల్ చైర్ పర్సన్ లు మొండితోక లత మొండితోక నాగరాణిల మామ గారు. వారి పార్థివ దేహాన్ని మధిర తీసుకురానున్నట్లు కుమారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అంతిమ సంస్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కాగా ప్రేమానందం మృతి పట్ల పట్టణానికి చెందిన ప్రముఖులు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.