చెరువుపూర్తి స్థాయి నిండి అలుగు పారాడంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

Published: Monday October 10, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ లో  ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండడంతోటి చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారడంతో  ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రజలంతా  సస్యశ్యామలంగా పాడి పంటలతో అమ్మవారి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో  ఉండాలని ఆదివారం రోజున  ప్రత్యేక కట్టమైసమ్మ దగ్గర పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని   అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, వ్యవసాయ సహకార సంఘం  చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రామిరెడ్డి, వంగటి లక్ష్మారెడ్డి మొద్దు అంజిరెడ్డి యువజన విభాగ అధ్యక్షుడు జెర్కోని రాజు, మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేష,  యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్పుల చంద్రయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area