రైతురుణమాపి ఎక్కడ.. ఉచిత ఎరువులు ఎక్కడ సీఎం గారు - బీజేపీ మొరపల్లి సత్తన్న

Published: Wednesday February 17, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన): జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపల్లి (మోరపల్లి) సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత ఎరువులు ఎక్కడ? రైతురుణ మాఫీ ఎక్కడ ఎప్పుడు సీఎం కేసీఆర్ గారు ? అని మండిపడ్డారు. రైతులను మోసగించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నలువాల వెంకటేష్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సంజీవ్ పవన్ సింగ్ వరుణ్ రమేష్ లక్ష్మన్ బీజేపీ జిల్లా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.