ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి *ఆటో డ్రైవర్ కొడుకు ఎంబిబిఎస్ కి ఎంపిక*

Published: Tuesday November 08, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం కొర్రవాని తండ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేఘావత్ రఘు యొక్క కుమారుడు
మేఘావత్.దేవేందర్ జవహర్ నవోదయ విద్యాలయం గచ్చిబౌలి కి ఎన్నికై,చదివి బాగా రాణించి వైద్య వృత్తికి
చేయవలసిన నిట్  ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి కోటి లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ లో
 ఎంబిబిఎస్ సీట్ కై అర్హత సాధించిన
మేఘావత్.దేవేందర్ ను టీపీసీసీ సభ్యులు,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మర్రి.నిరంజన్ రెడ్డి  ఘనంగా సన్మానించి,శాలువాతో
సత్కారం చేసి,భవిష్యత్ లో వైద్య వృత్తి కి మంచి పేరు తెచ్చి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలని కృషి,పట్టుదల,ఏకాగ్రత ఉంటే సాధించలేనిదీ ఏదీ లేదని మట్టిలో మాణిక్యం దేవేందర్ అని మంచాల మండలానికి, మరియు తల్లి దండ్రులకు మున్ముందు మరెంతో గొప్ప పేరు తేవాలని ఆశీర్వదించారు
నగరంలో ఆటో నడిపి నన్ను ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన మా అమ్మా నాన్నలకు పాదాభివందనాలు అని, భవిష్యత్ లో మంచి వైద్యం అందించి పేద ప్రజలకు నా వంతు సహకారం అందిస్తానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో తండ్రి రఘు,ధనంజయ, ధన్ రాజ్, రఘు, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.