సుందరయ్య వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం
Published: Friday May 20, 2022
అశ్వారావుపేట,(ప్రజాపాలన ప్రతినీతి )
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) వ్యవస్థాపకుల్లో ముఖ్యులైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వ్యక్తిత్వం పార్టీ శ్రేణులకు స్పూర్తి దాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆయన 37 వర్ధంతి ని గురువారం మండలంలో పలు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని పార్టీ కార్యాలయంలో సిఐటియు అనుబంధ హమాలి కార్మిక సంఘం ఆద్వర్యంలో పిట్టల అర్జున్ అద్యక్షతన సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నందిపాడు గ్రామ శాఖల ఆధ్వర్యంలో మాడి నాగేశ్వరరావు అద్యక్షతన స్థానిక సర్పంచ్ ఊకే వీరాస్వామి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ నిజాయితీకి, నిరాడంబరానికి సుందరయ్య నిలువెత్తు సాక్ష్యం అన్నారు.పార్టీలో అత్యున్నత పదవులు చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను గ్రహించే వారని కొనియాడారు. ఎం.పి గా పార్లమెంట్ కు సైకిల్ పై వెళ్ళిన వ్యక్తి సుందరయ్య మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బి చిరంజీవి, మండల కమిటీ సభ్యులు మేడిపల్లి వెంకటేశ్వరావు 5, శాఖా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: