కుందా కోటేశ్వరరావు కుటుంబ సభ్యులచే కుందా సావిత్రి సేవాసమితిలో చీరల పంపిణీ
Published: Monday December 20, 2021
మధిర డిసెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోఆత్కూర్ బైపాస్ రోడ్ లోని కుందా సావిత్రి సేవాసమితి హోమియో హాస్పిటల్ నందు భవన నిర్మాణ దాత కుందా కోటేశ్వరరావు మనవడు వెంకటేష్ కు నూతనంగా వివాహం జరిగిన సందర్భంగా నూతన దంపతులైన వెంకటేష్ మరియు మేఘనల చేతుల మీదగా 50 మంది మహిళలకు చీరలు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుందా కోటేశ్వరరావు, కుందా నాగభూషణం దంపతులు, కుందా వెంకటేష్ దంపతులతో పాటు హోమియో నిర్వాహకులు సంక్రాంతి శ్రీనివాసరావు, బొగ్గవరపు హరీష్ కుటుంబరావు, చేడే శ్రీనివాస్, సతీష్, మేడేపల్లి శ్రీనివాస్, హరీష్, సుగ్గల రామకృష్ణ, చావా భాను, శివరామకృష్ణ, పల్లపోతుల గోపాలకృష్ణ, ఖాసిం, కత్తి ప్రభాకర్, చిన్నం రాజేశ్వరి, తాళ్లూరి రిషిత, చీళ్ళ త్రివేణి, మేడిశెట్టి నందిని, తోట త్రివేణి, కుంచం నాగ ఎల్లేశ్వరి, మహేశ్వరి, శీలం విష్ణు ప్రియ, చిలివేరు జయశ్రీ, ముదిగొండ తేజశ్రీ, కోలా జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: