బోడుప్పల్ కార్పొరేషన్లో పర్యటించిన అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా
Published: Thursday November 24, 2022
మేడిపల్లి, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా క్షేత్ర స్థాయిలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కమిషనర్ పద్మజారాణి, కార్పొరేటర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థలోని డంపింగ్ యార్డు, స్మశాన వాటికలు మరియు క్రీడా ప్రాంగనాలతో పాటు చింతల చెరువు వద్ద విస్తృతంగా పర్యటించారు. ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, మున్సిపల్ అధికారులు డీఈలు శారదా, శ్రీలత మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: