ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం

Published: Monday February 15, 2021

ట్రస్ట్ వ్యవస్థాపకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14 ( ప్రజాపాలన ): కటుంబ సభ్యుల్లో ఒకరిని శాశ్వతంగా కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించామని ఎస్కెఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పరిధిలోని మర్పల్లి మండలానికి చెందిన పంచలింగాల్ గ్రామంలో రొయ్యల అక్తర్ మియా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వెంటనే స్పందించి గ్రామ సర్పంచ్ సనగారి సురేందర్ రెడ్డి గ్రామస్థులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబానికి 5 వేల రూపాయలు నగదు అందజేశామని వివరించారు.