బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పొరేటర్
Published: Tuesday October 05, 2021
మేడిపల్లి, అక్టోబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అర్హులైన ఆడపడుచులకు ఉచిత బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హబ్సిగూడ డివిజన్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కక్కిరెణి చేతన హరిష్ ముఖ్యఅతిథిగా పాల్గొని డివిజన్లోని గణేష్ నగర్ కాలనీకమ్యూనిటీ హాలు మరియు శ్రీనివాసపురం కమ్యూనిటీ హాలులో ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రుద్ర శేఖర్, అరవింద్ క్రిష్ణగౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రాగి లత వెంకట్ రెడ్డి, ముశిగంపల శివగౌడ్, జిహెచ్ఎంసి సిబ్బంది రాము, విఆర్ఎ శ్రీనివాస్, రమేష్, పద్మ రేణుక పాల్గొన్నారు.
Share this on your social network: