పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు ఉత్సవాలు

Published: Tuesday June 29, 2021
మధిర, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ప్రధానిపీవీ నరసింహారావుగారి శత జయంతి ఉత్సవాల ముగింపు మరియు పీవీ నరసింహారావు గారి జయంతి కార్యక్రమం మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్మరియు మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం సెట్టి కిషోర్ మాట్లాడుతూ. దేశంలో సంస్క‌రణ‌లు తీసుకొచ్చి, అభివృద్దిబాటలో న‌డిపించిన ప్ర‌ధానీ పీవీ న‌ర‌సింహారావు. అప్ప‌టి ప్ర‌ధాని రాజీవ్ గాంధి మ‌ర‌ణం త‌రువాత‌, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెల‌కొన్న అనిశ్చితి తొల‌గించేందుకు స‌మ‌ర్ధుడైన వ్యక్తి పీవీ ప్ర‌ధాని అయ్యాక, అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశ‌గా అడుగులు వేసింది. సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి, మధిర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, మాజీ సర్పంచులు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు మరియు కాంగ్రెస్ నాయకులు సూర్యదేవర కోటేశ్వరరావు, ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ మహమ్మద్ అలీ, షేక్ గౌస్ ఉద్దీన్ మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు.