షేక్ బుడాన్ బేగ్ కుటుంబానికి పొంగులేటి పరామర్శ
Published: Tuesday May 25, 2021
ఖమ్మం, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందిన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు షేక్ బుడాన్ బేగ్ కుటుంబాన్ని ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరామర్శించారు. బుడాన్ బేగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీకి బుడాన్ బేగ్ అందించిన సేవలను కొనియాడారు.
Share this on your social network: