సీఎం కెసిఆర్ సంక్షేమ పథకాలు పేదలకు ఓ వరం కళ్యాణ లక్ష్మీ'షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Published: Tuesday August 30, 2022
బోనకల్, ఆగస్టు 29 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రమైన బోనకల్ తో పాటు రావినూతల, ముష్ఠికుంట్ల తదితర గ్రామాల్లో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ,షాదీముబారక్ చెక్కులను ఆయా గ్రామాల సర్పంచులు భూక్య సైదా నాయక్, కొమ్మినేని ఉపేందర్, షేక్ బీ జాన్ బీ లు మండల గిర్ధావర్ గుగులోతు లక్ష్మణ్ తో కలసి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని,పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు వారి తల్లిదండ్రులకు భారం కావొద్దనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథాకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టె పథకాలు పేదలకు వరంగా నిలుస్తున్నాయని, సబ్బండ వర్గాలు ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా వుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, బోనకల్, రావినూతల ఉపసర్పంచ్ లు యార్లగడ్డ రాఘవ గౌడ్, బోయినపల్లి ఏడుకొండలు, ఎంపీటీసీ కందిమళ్ళ. రాధా, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దీన్, పంచాయతీ కార్యదర్శి జొన్నలగడ్డ అశోక్ తదితరులు పాల్గొన్నారు.