నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి ** యువ నాయకుడు ఆవిడపు ప్రణయ్ **

Published: Wednesday April 19, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 18 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం వెంటనే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని యువ నాయకులు ఆవిడపు ప్రణయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ బీసీ నిరుద్యోగ యువకులకు 2018లో 4000 మంది నిరుద్యోగులు బీసీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో కేవలం 529 మందికి మాత్రమే రుణం అందించారని, మిగతా వారికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ప్రభుత్వం స్పందించి సబ్సిడీతో కూడిన రుణాలను  నిరుద్యోగులకు అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గడ్డల ప్రణయ్ కుమార్,నాగరాజు, పిప్రే సాయి,గడ్డల కిరణ్, సాగర్,దాడి సాగర్ తరుణ్ సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.