ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం

Published: Wednesday February 24, 2021
ఖమ్మం రీజినల్ మేనేజర్ సొలోమాన్
మధిర, ఫిబ్రవరి 23, ప్రజాపాలన: జిల్లాలో ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని జిల్లా రీజినల్ మేనేజర్ సోలోమన్ తెలిపారు మంగళవారం ఆయన మధిర డిపోలో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టిసి ఎండి ఆదేశాల మేరకు ఆర్టీసీలో పంచ సూత్రాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 1 నుండి ఖమ్మంలో నూతన బస్టాండ్ నుండి బస్సులు రాకపోకలు కొనసాగిస్తున్నాయని అని తెలిపారు ఖమ్మం పాత బస్ స్టాండ్ మూసివేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మధిర నుండి జమలాపురం వరకు బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు విలేకర్ల సమావేశంలో మధిర డిపో మేనేజర్ దేవదానం పాల్గొన్నారు.