ఘనంగా కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు జన్మదిన వేడుకలు

Published: Wednesday February 16, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వార్డు కార్యాలయంలో డివిజన్ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావులతో కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ నా పుట్టిన రోజును కార్యకర్తల మధ్య జరుపుకోవడం చాలాా సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్ గా గెలిచి ఒక సంవత్సరం గడిచిన సందర్భంగా డివిజన్లో జరిగిన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. తరువాత పీర్జాదిగూడ మా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లలకు భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, సీనియర్ నాయకులు మేక బుచ్చి రెడ్డి, ముత్తినేని జగదీష్, తాళ్ల మంగ గౌడ్ , వీణ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరీ కుమారస్వామి, వులుగొండ నారాయణదాసు, వేముల వెంకట్ రెడ్డి, ఇల్లితం నరసింహారెడ్డి, తాళ్ల బాలకృష్ణ, పడిగాo నగేష్, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, అల్లాడి నిరంజన్ గౌడ్, పరి శ్రీనివాస్, రాపొల్ మహేందర్, పలుగుల అంజయ్య, కల్మ కళ్ళ లింగం, శైలేందర్, పరశురాం, ముత్యం, భాస్కర్, పెరిక బద్రీనాథ్, యాదగిరి రెడ్డి, కందగట్ల దయానంద్ రెడ్డి, బిక్షపతి, నిశాంత్ పాల్గొన్నారు.