మునుగోడు ఉప ఎన్నికల విజయోత్సవ ర్యాలీ మండల టిఆర్ఎస్ శ్రేణులు బాణాసంచాలతో సంబరాలు

Published: Monday November 07, 2022
బోనకల్, నవంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి: మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించిన సందర్భంగా మండల కేంద్రంలో ఖమ్మం రోడ్డు నందు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీ మండల నాయకులతో కలిసి టిఆర్ఎస్ శ్రేణులతో బాణసంచాలు కాలుస్తూ భారీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకొని టిఆర్ఎస్ గెలుపుకు ప్రజలు మొగ్గు చూపారని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా వివిధ రకాల పథకాలు చూసి ఉభయ కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మునుగోడు అసెంబ్లీ స్థానం విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు, మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, రామాపురం సర్పంచ్ తొండపు వేణు, టిఆర్ఎస్ నాయకులు వెనిగళ్ళ మురళి, యార్లగడ్డ చిన్న నరసింహ, పింటూ సాహెబ్, మోర్ల నరసింహారావు, భూక్యా శ్రీను టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉభయ కమ్యూనిస్టు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.