ఘనంగా అయ్యప్పల ఇరుముడి మహోత్సవం
Published: Wednesday January 11, 2023
బోనకల్, జనవరి 10 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చోప్పకట్లపాలెం గ్రామంలో అయ్యప్ప స్వాములు 41 రోజులు దీక్ష పూర్తిచేసుకుని మంగళవారం ఇరుముడి ధరించి శబరిమలైకు వెళ్లారు. అయ్యప్పల ఇరుముడి మహోత్సవం గుర్రం నరేష్ గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్పను భక్తితో కొలుస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇరుముడి కార్యక్రమం సందర్భంగా మలినాధ మహానాగ శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ద ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కుర్ర పాపారావు గురుస్వామి, అయ్యప్పలు నంబూరి నరసింహారావు, బోయినపల్లి ముఖేష్, పర్సగాని గోపి, ఎర్రం శెట్టి రవి, గరపాకుల గోపి, బాలు, గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు, ఉప సర్పంచ్ బోయినపల్లి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు బోయిన శేఖర్ బాబు, పోలెబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: