సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత బృందం...

Published: Thursday June 17, 2021
జగిత్యాల, జూన్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసిఆర్ కు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచినందుకు బుధవారం రోజున జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ఆధ్వర్యంలో సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.  పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత మరియు ఎమ్మేల్యేలు సంజయ్ కుమార్ విద్యాసాగర్ రావు రవిశంకర్ చెన్నమనేని రమేష్ బాబు జడ్పీ చైర్ పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు జడ్పీటీసీ సభ్యులు దరిశెట్టి లావణ్య నాగం భూమయ్య పుణుగోటి ప్రశాంతి బత్తిని అరుణ మేడిపల్లి మనోహర్ రెడ్డి కొండపల్కల రామ్మోహన్ రావు సంగెపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.