మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Wednesday February 15, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 14 (ప్రజాపాలన ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి కొనియాడారు. కార్పొరేషన్ పరిధిలోని 11వ మరియు 12వ డివిజన్లలో  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత  కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్క వెంకట్ రెడ్డి కమీషనర్ డా. పి. రామకృష్ణ రావు,         స్థానిక కార్పొరేటర్లు మద్ది యుగేందర్ రెడ్డి, అమర్ సింగ్ లతో కలిసి ప్రారంభించారు. కంటి వెలుగు క్యాంపును  ప్రతి ఒక్కరూ సద్వినియోగం
  చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడే పోచయ్య, డిఈ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి,ఏఇ బిక్షపతి, టిపిఎస్ రాజీవ్ రెడ్డి,నాయకులు చెరుకు పెంటయ్య,ఏనుగు మనోరంజన్ రెడ్డి,జావీద్ ఖాన్, రాజరాజు,డాక్టర్ ప్రతిభ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.