మట్టా ఆరోగ్యమ్మకు నివాళులర్పించిన టిఆర్ఎస్ నాయకులు..

Published: Monday January 17, 2022
తల్లాడ, జనవరి 16 (ప్రజాపాలన న్యూస్): టిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాతృమూర్తి ఆరోగ్యమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ మండలం లోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీ గోవిందు విజయమ్మ భర్త గోవిందు శ్రీనివాసరావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకూబ్ పాషా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మట్టా దయానంద్ ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తమ సంతాప, సానుభూతిని వ్యక్తం చేశారు.