5వ వార్డు కౌన్సిలర్ కు కనుమ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

Published: Monday January 17, 2022
వికారాబాద్ బ్యూరో 16 జనవరి ప్రజాపాలన : సంక్రాంతి పండగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 5వ వార్డు కౌన్సిలర్ పలుగుట్ట ప్రవళిక కృష్ణ ఇంటికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్ పిల్లల చదువుల గురించి ఆరాతీసి బాగా చదువు కోవాలని సూచించారు. కొత్రేపల్లి వార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తానని అన్నారు.