మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణి జన్మదినం పురస్కరించుకొని మార్కండేయ మందిరం లో ప్రత్యేక
Published: Thursday August 25, 2022
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి): మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణి జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులు మార్కండేయ మందిరం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రక్తదానం చేసి పేషెంట్లకు పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘము పట్టణ అధ్యక్షులు అకుభత్తిని శ్రీనివాస్, సహయ కార్యదర్శి భోగ రాజు, డైరెక్టర్ చేటపెళ్లి గణేష్, భోగ చిన్న జి ఆర్, ఆడెపు సత్యం, అజ్జు భాయ్, అనిల్, పెండం గంగాధర్, మహేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: