శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గాయత్రి దేవి అలంకారం

Published: Friday September 30, 2022

మధిర సెప్టెంబర్ 29 పరిధిలో గురువారం నాడు దేవి ఉత్సవాలుఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల నాల్గవ రోజు సందర్భంగా శ్రీ గాయత్రి దేవి అలంకారం భక్తులందరికీ తెలియజేయునది ఏమనగా దసరా సందర్భంగా దశావతారం సింహద్వారం నుండి ప్రవేశించి అమ్మవారిని దర్శించు కొన వలసిందిగా కోరుచున్నాము . పూజ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ గాయత్రి దేవి అమ్మవారు ఈ శరన్నవరాత్రి సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావుభక్తులకు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకుఅసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినాము అని తెలిపినారు. పూజ చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించదరు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళ భక్త మనులకు శుభవార్త ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయము నందు సాయంత్రం మహిళలతో కు బతుకమ్మల వద్ద ఫోటోషూట్ కార్యక్రమం పెద్దద ఎత్తున మహిళలు పాల్గొని  సాంప్రదాయ వస్త్రధారణతో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు